డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

28020చూసినవారు
డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామానికి చెందిన పడమటి లక్ష్మణ్ మంగళవారం గుమ్మడిదలలోని బంధువు అంత్యక్రియలకు బైక్పై వెళ్లి వస్తుండగా వీరన్నగూడ ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి లక్ష్మణ్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో లక్ష్మణ్ తలకు తీవ్రమైన గాయాలు కాగా సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్