ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తుందని కల్వకుంట్ల ఎంపీపీ ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి జాకీర్ పాష , గ్రామ తాజా మాజీ సర్పంచ్ బిక్షపతి అన్నారు. కల్వకుంట గ్రామంలో మంగళవారం ఎంపీపీ ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో వారు పాల్గొని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు ఏకరూప దుస్తులను ప్రభుత్వమే అందిస్తుందన్నారు.