మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అయిన యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి యోగాసనా పోటీల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.