ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు
శ్రీరామానుజ జయంతి తిరునక్షత్రం సందర్భంగా ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవమూర్తులను పల్లకిలో ఆసీనులను గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ పూజారులు రామాచార్యులు, వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు 10, 11, 12 తేదీలలో వైభవంగా జరిగాయి.