శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికుల బిక్షాటన నిర్వహించారు. జీతాలు లేక భిక్షాటన చేసుకునే పరిస్థితి ఏర్పడిందని కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని వారు కోరారు. ఈ విషయంపై ఎంపీడీవో నల్ల శ్రీవాణిని వివరణ కోరగా ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల జీపీలకు నిధులు మంజూరయ్యాయని వారికి సరైన అవగాహన లేక కార్మికులు ధర్నా చేస్తున్నారని, ఈ ధర్నాలో పాల్గొన్న కార్మికులపై చర్యలు తప్పవన్నారు.