విద్యుత్ సమస్యలపై సోమవారం జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ కో అధికారులు ప్రజావాణి నిర్వహించారు. సమస్యలపై వినియోగదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రజావాణి నిర్వహించినట్లు టీజీ ఎన్ పీడిసిఎల్ ఎస్ఈ బొంకూరి సుదర్శన్ తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.