చిరాగ్ పాశ్వాన్.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత మీడియా పతాక శీర్షికల్లో ఆయన పేరు మార్మోగుతున్నది. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడంతోపాటు నరేంద్రమోదీ 3.0 క్యాబినెట్లో చోటు కూడా దక్కించుకున్నారు. అయితే, చార్మింగ్గా, స్టైల్గా కనిపించే చిరాగ్ పాశ్వాన్పై యువతులు మనస్సు పారేసుకున్నారు. ఆ జాబితాలో బోజ్పురి సినీ నటి నిషా దూబే చేరిపోయారు. చిరాగ్ పాశ్వాన్ను ప్రేమిస్తున్నానంటూ నిషా దూబే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.