సినీ, టీవీ నటిగా, మోడల్గా గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం రాహుల్ గాంధీని ఓడించే స్థాయికి ఎదిగిన 48 ఏళ్ల స్మృతి ఇరానీ ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ నుంచి మూడోసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. 2014లో ఇదే నియోజకవర్గంలో రాహుల్ గాంధీ చేతిలో 1.07 లక్షల తేడాతో ఓడిపోయిన ఆమె 2019లో 54,731 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గాంధీల కంచుకోట అయిన అమేథీలో రాహుల్గాంధీని స్మృతి ఓడించింది.