తెలంగాణ నేతలకు సోనియా గాంధీ ఝలక్..!

60చూసినవారు
తెలంగాణ నేతలకు సోనియా గాంధీ ఝలక్..!
యూపీఎ హయాంలో తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత పదేళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావించింది. దీనికి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. అయితే తాజాగా జూన్ 2 వేడుకలకు రావడం లేదని తెలంగాణ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో ఎంతో ఊహించుకున్నా కాంగ్రెస్ నేతలు ఉసూరుమంటున్నారు.

సంబంధిత పోస్ట్