జూన్ 2వ తేదీన దశాబ్ది ఆవిర్భావ దినోత్సవాల కోసం.. తెలంగాణ సర్వసన్నద్ధమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగే తొలి వేడుకలు కావడం వల్ల దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీకి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు కూడా ఆహ్వాన పత్రికలు పంపారు. అయితే కేసీఆర్ వేడుకలకు వస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఒకే వేదికపై సోనియా గాంధీ- కేసీఆర్ను చూడబోతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.