చద్దన్నం వద్దనందుకు తండ్రిని చితకబాదిన కొడుకులు

85చూసినవారు
TG: చద్దన్నం వద్దనందుకు కొడుకులు తండ్రిని చితకబాదిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో చోటు చేసుకుంది. జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రంబండి కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కొడుకుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కోడలు పెట్టిన చద్ది అన్నం మెత్తగా ఉంది అని వదిలేసినందుకు చిన్న కొడుకు తనని విచక్షణారహితంగా కొట్టాడని, తన పెద్ద కొడుకు సైతం దాడి చేశాడని ఆ వృద్దుడు తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్