మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఓ చిరుత ఆరు కూనలకు జన్మనిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గామిని భారత్లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. ఈ చిరుత ఆరు కూనలకు జన్మనివ్వడంతో భారత్లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 14కు పెరిగింది. ఈ ఆరు కూనలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చిరుత పులుల సంఖ్య 27కు పెరిగింది.