ఆసియా లెజెండ్స్ లీగ్లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు తిసారా పెరీరా సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పెరీరా ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్స్లు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో పెరీరా కేవలం 35 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో ఆఫ్గానిస్తాన్పై 26 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.