లోక్సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ ప్రక్రియ సోమవారం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 24.87 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమబెంగాల్లో 32.78 %, మధ్యప్రదేశ్లో 32.38 %, ఝార్ఖండ్ 27.40 %, యూపీ 27.12 %, తెలంగాణలో 24.31 %, ఏపీలో 23.10 %, బీహార్లో 22.54 %, మహారాష్ట్రలో 17.51 %, ఒడిశాలో 17.51 %, జమ్మూకాశ్మీర్లో 14.94 % నమోదైనట్లు తెలిపింది.