మణిపూర్‌ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆరా

586చూసినవారు
మణిపూర్‌ హింసాకాండపై సుప్రీంకోర్టు ఆరా
హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదికను ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్