మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

65చూసినవారు
మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
పీఏపల్లి: జంటనగరాలకు నీటి సరఫరా చేసే కీలక విభాగమైన పుట్టంగండి సిస్టర్న్ కట్ట మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఎన్సి నాగేంద్రరావు ఎమ్మార్పీ అధికారులను ఆదేశించారు. ఆదివారం సిస్టర్న్ కట్ట పేరాపెట్ వాల్ 100 మీటర్ల మేర దెబ్బతిని కూలిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. కట్ట దెబ్బతిన్న ప్రాంతంలో వెంటనే గ్యాబిన్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట అధికారులు అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్