కోదాడ పట్టణంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి కావడంతో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తి మృతదేహం పై నుండి వాహనాలు వెళ్లడంతో శరీరం మొత్తం నుజ్జు నుజ్జయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు శరీర భాగాల ముద్దలను ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.