కోదాడ పట్టణానికి చెందిన పెయింటర్ షేక్ బాబు 70 ఏళ్ల వయస్సులో సైకిల్ తొక్కుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పెయింటర్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సతీష్ బాబు, గౌరవ సలహాదారులు ఎస్ఎస్ రావు, తదితరులు పాల్గొన్నారు.