విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతగిరి ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతగిరి మండల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు.
విద్యార్థులు గుర్తింపు లేని యాప్ ల ద్వారా నగదు లావాదేవీలు జరపవద్దన్నారు. చరవాణిలతో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సంభాషణలు చేయవద్దని సూచించారు. పోలీసు కళాజాత బృందాలు ఆటపాట ప్రదర్శించాయి.