కోదాడ మండలం తొగర్రాయిలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం దేవతాహ్వానం, మండప పూజలు, భేరీ పూజ, హోమము, ధ్వజారోహణ జరిపారు. సంతానం లేని దంపతులు గరుడ ప్రసాదం అందించారు. కళ్యాణ మహోత్సవంలో బాగంగా ధ్వజారోహణ అనంతరం దంపతులకు స్వామి వారి గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుంద ని భక్తుల విశ్వాసం.