ఆక్రమణల నుండి చెరువును కాపాడాలి

2589చూసినవారు
కోదాడ మండలం గణపవరం ఊర చెరువుని చుట్టుపక్కల రైతులు ఆక్రమిస్తున్నారని ఆ గ్రామ మత్స్యకారులు సోమవారం చెరువు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్రమించిన భూమి ని మీడియా కు చూపించారు. చెరువు ఆక్రమణ కు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువు ఆక్రమణ కు గురువుతున్నా కొద్ది తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుండి చెరువును కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్