భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం కోదాడ పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్ హాల్ లో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నహక సమావేశంలో ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు. బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.