కోదాడ పట్టణ పోలీసుల తనిఖీలో భాగంగా శుక్రవారం అనుమానస్పదంగా కనపడిన ఒక వ్యక్తి పట్టుకొని విచారించగా హుజూర్ నగర్ కి చెందిన మామిడి గోపిగా గుర్తించారు. ఇతనిపై పలు స్టేషన్ లలో దొంగతనాల కేసులు ఉన్నట్టు తెలియడంతో విచారించగా ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, ఇత్తడి వస్తువులు నాలుగు గుడిగంటలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పట్టణ సీఐ రాము, ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.