రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

84చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నిడమానూరు మండల పరిధిలోని కోటమైసమ్మ గుడి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నారమ్మగూడెం గ్రామానికి చెందిన సుబ్బమ్మ(60)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సుబ్బమ్మను అంబులెన్సులో మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్