సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలో చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు శుక్రవారం పురస్కరించుకొని శ్రీ సరస్వతి అమ్మవారికి విశేషంగా పుష్పార్చన, శ్రీ చక్ర దేవతకు కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పం, ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు.