సూర్యాపేట జిల్లా మద్దిరాలలో మహిళకు వ్యవసాయానికి వాడే గడ్డి మందు తాగించగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాలకు చెందిన కుంచం కళమ్మ (48)ను భర్త వెంకన్న, మరికొందరు వ్యవసాయానికి వాడే గడ్డి మందును నోట్లో పోసి తాగించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.