సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శన పల్లి గ్రామంలో మంచినీళ్లకుంట చెరువులో కొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు పొందకుండా చెరువు మట్టిని విచ్చలవిడిగా తరలిస్తున్నారని, వారిపై తక్షణమే రెవిన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని ఐఎఫ్ టి యు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య డిమాండ్ చేశారు. గ్రామంలో గత కొన్ని రోజులుగా మంచినీళ్ల కుంట చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించాలన్నారు.