ఇండియా కూటమి నేతలకు స్వాతి మాలీవాల్ లేఖ

81చూసినవారు
ఇండియా కూటమి నేతలకు స్వాతి మాలీవాల్ లేఖ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడటంపై ఇండియా కూటమి నేతలకు AAP ఎంపీ స్వాతి మాలీవాల్ లేఖ రాశారు. ఈ విషయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నేతలను కోరారు. ‘ఈ వ్యవహారంపై మాట్లాడినందుకు నాకు అండగా నిలవాల్సిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నన్ను దూషిస్తున్నారు. 8ఏళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా సేవలు అందించిన నాకు ఇలా జరగడం బాధాకరం’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్