సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నా: కిషన్ రెడ్డి

67చూసినవారు
సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తున్నా: కిషన్ రెడ్డి
ప్రధాని మోదీ 3.0 కేబినెట్ లో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. దీంతో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. 'సికింద్రాబాద్ ప్రజలు, మోదీ ఆశీస్సులతో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని, జేపీ నడ్డా, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్