నిత్యం సీరియస్గా ఉండే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఎట్టకేలకు నవ్వారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలిచాక ఆయన నవ్వుతూ సంబరాలు చేసుకున్నారు. జడేజా ఫోర్ కొట్టి భారత్ను విజయతీరాలకు చేర్చాక పక్కనే ఉన్న క్రికెటర్లతో తన సంతోషాన్ని పంచుకున్నారు. చిరునవ్వుతో మైదానంలోకి వచ్చి క్రికెటర్లను అభినందించారు. సాధారణంగా భారత క్రికెటర్లు సిక్స్లు కొట్టినా, సెంచరీలు చేసిన ఆయన మ్యాచ్ గెలిచే వరకు సీరియస్గా కనిపిస్తారు.