మార్చి 12 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరపనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉభయ సభలను సమన్ చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంతో మొదలవుతాయి. అయితే సమావేశాలు ఎప్పటిదాకా కొనసాగుతాయనేది 13న జరిగే అసెంబ్లీ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్ణయించనుంది.