తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్లో తల్లిని కన్నకొడుకే గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.