తెలంగాణలో 3 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్, వైస్ఛైర్ పర్సన్ ఎన్నిక తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 31న ఛైర్ పర్సన్, వైస్ పర్సన్ల ఎన్నికకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 31న కొల్లాపూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక, కామారెడ్డి పురపాలిక వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక, నార్సింగి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నిక కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రేపు నోటీసు జారీ చేయనున్నారు.