తెలంగాణలో పెరుగనున్న ఉష్ణోగ్రతలు

81చూసినవారు
తెలంగాణలో పెరుగనున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నుంచి ఎండల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 37 డిగ్రీల నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. రాబోయే వారం పది రోజుల్లో మండే ఎండలతో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్