తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగానే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ ఇదే పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.