BJPకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు: ఈటల

68చూసినవారు
BJPకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు: ఈటల
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ఫలితాలు సాధించనుందని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. అందరూ అనుకున్న దానికి భిన్నంగా పోలింగ్‌ జరిగిందని చెప్పారు. నిశ్శబ్ద విప్లవం ఫలితం జూన్ 4న తెలుస్తుందన్నారు. మోదీ పాలనలోనే దేశం ముందుకెళ్తుందని ప్రజలు భావించారని.. బీజేపీకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతామన్నారు.

సంబంధిత పోస్ట్