జనసేన నేత నాగబాబు మళ్లీ తన ట్విట్టర్ ఖాతాను యాక్టివేట్ చేసుకున్నారు. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ పై పరోక్షంగా చేసిన పోస్టును డిలీట్ చేసినట్లు తాజాగా మరో పోస్టును పెట్టారు. రెండు రోజుల క్రితం 'మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే' అని నాగాబాబు పోస్టు పెట్టారు. దీంతో అది హీరో అల్లు అర్జున్ గురించే పెట్టారని తీవ్ర విమర్శలు వచ్చాయి.