కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో నిండిపోయిన వీడియో తాజాగా నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై ఉత్తర రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని స్పష్టంచేసింది. ‘‘కొందరు రైతులు బలవంతంగా రైలులోకి ఎక్కినప్పుడు జరిగిన సంఘటన ఇది. పాత వీడియోను ప్రస్తుతం షేర్ చేశారు. దయచేసి ఇలాంటివి ప్రచారం చేయకండి. ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోండి’’ పేర్కొంది.