నిన్న బెంగళూరు మ్యాచులో తమ ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యంపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఆర్సీబీని 150 పరుగులకే కట్టడి చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘క్యాచ్లు వదిలేయడం మమ్మల్ని బాగా దెబ్బతీసింది. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం. పైగా ఛేదనలో ఉన్నప్పుడు కీలక బ్యాటర్లు రనౌటయ్యారు. పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయాం. టూ-పేస్డ్ పిచ్లో 160-170 పరుగులు ఛేదించగల స్కోరు’’ అని మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ అన్నారు.