తెలంగాణ వచ్చి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో మాట్లాడుతూ.. 'అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ఉండాలని అనుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటిస్తున్నాం. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది అందులోనే. ప్రజల ఆకాంక్షల మేరకు టీఎస్ను.. టీజీగా మార్చాం. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి రూపంగా ఉండాలి’’ అని అన్నారు.