నిన్న పంజాబ్తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు. ఆదిలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ 182 పరుగులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపాడు. నితీశ్ రెడ్డి ఓ అద్భుతమైన ఆటగాడు అని, బ్యాటింగ్తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్తో గెలుపులో కీలక పాత్ర పోషించాడని కమిన్స్ అన్నాడు.