రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా స్థానిక వనరులు, స్వదేశీ పద్ధతులతో చేపట్టే సాగును సేంద్రియ లేదా సహజ వ్యవసాయం అంటారు. సేంద్రియ వ్యవసాయం వల్ల భూసారం, నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. దానివల్ల తేనెటీగలు, పక్షులు, సీతాకోకచిలుకల మనుగడకు ఎలాంటి నష్టమూ వాటిల్లదు. నదులు, చెరువులు ఇతర జలవనరుల్లో కాలుష్యమూ తగ్గుతుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకొంటాయి.