బీజేపీ 1984లో రెండు సీట్లకే పరిమితమైనప్పటి నుంచి అధికారంలోకి రావడంతో అద్వానీ కీలక పాత్ర పోషించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయోధ్య రథయాత్రతో హిందూ ఓట్లను ఏకం చేయగలిగారు. అందుకే అప్పట్లో ఆయన్ను ప్రధానమంత్రి పదవికి సమర్థుడైన నేతగా భావించారు. కానీ 1999లో వాజ్పేయ్ ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014లోనూ ఆయనకు అవకాశం రాలేదు. దీంతో ప్రధాని పీఠాన్ని ఆయన అధిరోహించలేకపోయారు.