ఆంధ్రా
క్రికెట్ అసోసియేషన్ లో రూ. 100 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు రాత్రికి రాత్రే మాయం చేశారంటూ విశాఖ
జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు అసోసియేషన్ కి చెందిన పలు ఆస్తులు కబ్జా జరిగిందని వారు మండిపడుతున్నారు. ఇందులో ACA అధ్యక్షుడు శరత్ చంద్ర రెడ్డి, సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి హస్తం ఉందని
జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించడం జరిగింది.