వేగంగా వస్తున్న బైక్ను యూ టర్నింగ్ తీసుకుంటున్న ఆటో ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు వ్యక్తులతోపాటు ఆటో డ్రైవర్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డాడు. అయితే ఆటో రన్నింగ్లో ఉండటంతో రోడ్డుపై రౌండు కొట్టింది. ఈ క్రమంలోనే నడుస్తున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్లో గల షాహుపురిలోని పాట్కీ ఆసుపత్రి సమీపంలో జరిగింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.