లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న హిమాచల్ప్రదేశ్లోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడంతో.. ఆ స్థానాలకు కూడా ఈ విడతలోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఈ ఆరుగురు బీజేపీ టికెట్పై పోటీచేస్తున్నారు. బీఎస్పీ బరిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్నది.