భారతదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. అందులో ఒకటే జామియా మసీదు. ఈ మసీదు జమ్మూ కాశ్మీర్లోని పాత శ్రీనగర్లో ఉంది. దేశంలోనే అత్యంత పవిత్రమైన మసీదులలో.. ఈ మసీదు ఒకటి. దీనిలో ఒకేసారి 33వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు. ఈ మసీదును 14వ శతాబ్దంలో కాశ్మీర్లో సుల్తాన్ సికిందర్ బుత్షికాన్ నిర్మించారు.