సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం

55చూసినవారు
సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం
దేశంలోని సైనిక్ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. దీనిపై రక్షణ మంత్రిత్వశాఖ తీవ్రంగా స్పందించింది. ‘కాంగ్రెస్ ఆరోపణలు అసంబద్ధమైనవి. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి’ అని ఖండించింది. విద్యారంగంలో అనుభవం ఉన్న సంస్థలతో 100 పాఠశాలలను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్