TG: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల తగ్గుదలకు ఆంగ్ల మాధ్యమం లేకపోవడమే కారణమని అప్పట్లో ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. దీంతో ప్రభుత్వం 2022-23 నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ ప్రైమరీ) లేకపోవడం, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ లేకపోవడం కారణాలుగా వివరిస్తున్నాయి. నిపుణులు మాత్రం తరగతికి ఒక టీచర్ ఉన్న చోట కూడా నాణ్యమైన విద్య అందటం లేదని సర్వేలో తేలిందని పేర్కొంటున్నారు.