బీసీ బిల్లును BRS పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పార్లమెంటులో పోరాటానికి కూడా BRS కలిసి వస్తుందని అన్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటే రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలని కోరారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మంగళవారం ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో రూ.20,000 కోట్ల నిధులుపెట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు.